సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లెటర్..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లెటర్ రాశారు.

 Congress Leader V Hanumantha Rao Wrote Letter To Cm Kcr , Congress, Kcr, V.hanum-TeluguStop.com

రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ కెసిఆర్ కి లెటర్ రాయడం జరిగింది.త్వరగా చికిత్స విషయంలో ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని ఇంతకుముందే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారని లెటర్ లో వి.హెచ్ గుర్తు చేయడం జరిగింది.

అదే రీతిలో కరోనా రోగులకు ప్రభుత్వం కిట్స్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

దీంతో విహెచ్ రాసిన లెటర్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.తెలంగాణలో చాలావరకు కరోనా చికిత్స విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నాయి.

కరోనా బారిన పడిన రోగులు చికిత్స నిమిత్తం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.పక్క తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిరిగా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని వీహెచ్ లెటర్ రాయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube