తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో పుంఖాలు పుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు ఈటల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఈటల కాంగ్రెస్లో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని వస్తున్న ఊహాగానాలకు ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో అని తెలంగాణ ప్రజలతో పాటుగా, ఈటల అనుచరులు కూడా ఎదురు చూస్తున్నారట.అయితే తాజాగా బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, ఈటల కలిసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ అంశం పై స్పందించిన కిషన్ రెడ్డి, ఈటల తనను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
కానీ ఇద్దరం ఫోన్లో మాత్రమే మాట్లాడుకున్నామని పేర్కొన్నారు.
ఇకపోతే ఈటల నేను కలిసి 15 ఏళ్ళు పనిచేసాం.ఆ చనువుతో నన్ను కలుస్తా అని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది.
ఈ విషయానికి ఇంతలా ప్రచారం చేయడం విడ్డూరం అంటూ వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో ఈటల వ్యవహారం పిల్లి తోకను చూసి పులి అని ప్రచారం చేస్తున్నట్లుగా ఉందంటున్నారట కామన్ పీపుల్.
అసలు ఈటల నుండి ఏ సమాచారం వెలువడక ముందే ఏవేవో ప్రచారాలు జరగడం ఆశ్చర్యం.