కేంద్ర మంత్రితో భేటీ అయిన ఈటల రాజేందర్..!!

భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది ఈటల రాజేందర్ పొలిటికల్ ఎపిసోడ్.టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మంత్రి పదవి నుండి తొలగించాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులను ఈటల రాజేందర్ కలుస్తున్న సంగతి తెలిసిందే.

 Eetela Rajender Meet With Central Minister Kishan Reddy, Eetela Rajendhar, Kisha-TeluguStop.com

దీనిలో భాగంగా తాజాగా హైదరాబాద్ శివారులో ఫామ్ హౌస్ లో కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

ఇదే క్రమంలో రాజీనామాపై బిజెపి పార్టీకి చెందిన నాయకులతో ఈటెల సమాలోచనలు చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

కిషన్ రెడ్డి తో భేటీ కాక ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రేవంత్ రెడ్డి తో ఈటల మొన్న బేటీ అవ్వడం జరిగింది.మరోపక్క తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేందర్ పొలిటికల్ ఎపిసోడ్ కాక పుట్టించటం గ్యారెంటీ అన్నట్టు టాక్.ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు వరుస పెట్టి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఈటల పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube