సహజంగానే మొసళ్లు ఎక్కువ కాలం జీవిస్తాయి.వీటి జీవితకాలం మిగతా ప్రాణుల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.
అంతే కాదు వీటి సంతానోత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.ఇతర జంతువులు ఒక కాన్పులో ఒకటి నుంచి ఐదు లేదా పది వరకు మాత్రమే జన్మనిస్తాయి.
కానీ ఒడిశాలోని ఓ వన్యప్రాణి సంరక్షణా కేంద్రలో ఉండే మొసరి అరుదైన రికార్డు నమోదు చేసింది.
దాదాపు 30ఏళ్ల తర్వాత మరోసారి 28 పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ మొసలి పిల్లలన్నింటినీ సహజమైన వాతావరణంలోనే పెంచుతున్నట్టు అటవీ శాఖ ఆఫీసర్లు వెల్లడించారు.అందుకే అవన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని వారు వివరించారు.
ఒడిశా- అంగుల్ జిల్లాలోని సాట్కోసియా వన్యప్రాణి సంరక్షణా కేంద్రంలో ఘేరియల్ మొసలి ఉంటోంది.ఇది చేపలను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది.
ఇది చాలా అరుదైన జాతికి చెందిన మొసలి.సుమారు 30ఏళ్ల కింద ఇది ప్రసవించింది.
అయితే అప్పటి నుంచి మళ్లీ పిల్లల్ని కనలేదు.కానీ ఇప్పుడు మళ్లీ ఏకంగా 28పిల్లలకు జన్మనిచ్చి రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి.
ఈ విషయాన్ని ఫారెస్ట్ చీఫ్ రేంజర్ ప్రదీప్రాజ్ కరాటే మీడియాకు చెప్పారు.ఇది చాలా అరుదుగా జరిగే ఘటన అని వివరించారు.
అయితే ఆ మొసలిని తమ కంట్రోల్ ఉంచుకుని నిత్యం పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఆ మొసలి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని, నీటిపై తేలియాడుతున్నాయని తెలిపారు.
ఆ మొసలి పిల్లలతో ఘేరియల్మహానది సాట్కోసియాలో ఉంటుందని వివరించారు.వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నామని సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు.
ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ మొసలి జాతిని బతికించాలని అంతా కామెంట్లు పెడుతున్నారు.
ఎంతైనా ఇలాంటి విషయాలు కూడా చాలా అరుదుగా జరుగుతుంటాయి కదా.