ప్రస్తుతం మన దేశంలో కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
కరోనా మొదటి వేవ్ లో కేసులు భారీగా నమోదైనా, మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగానే నమోదవుతూనే, మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి ఉంది.
ఐతే కరోనా వల్ల ఎన్నో కుటుంబాలలో విషాదం నెలకొంది.చాలా మంది ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఉంది.
అంతేకాక కోవిడ్ పోరాడుతూనే సహాయం కోసం ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.దీంతో సెలెబ్రెటీలు సైతం కోవిడ్ బాధితులకు తమకు తోచిన సహాయం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.
సింగర్ స్మిత తాజాగా తన గొప్ప మనసును చాటుకుంది.సోనూసూద్ లాంటి వాళ్ళు చేస్తున్న సేవలు ఒకవైపు కాగా, ఎవరికి వారు అవసరం ఉన్న వారికి మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు.
సింగర్ స్మిత సైతం ఏఎల్ఏఓతో ఒప్పందం చేసుకొని 100 ఆక్సిజన్ పడకలను అందించారు. కోవిడ్ మరణాలు ఎక్కువగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోనే జరుగుతున్నందున అందరూ ఇటువంటి సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించారు.
చిరంజీవి సైతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.