దేశంలోని ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తుండగా కోవాగ్జిన్ టీకా విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది.భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అమెరికా, యూకే కంట్రీలు అంటున్నాయి.
డబ్లుహెచ్వో అనుమతి ఉన్న టీకాలు వేసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతి ఇస్తామని, కోవాగ్జిన్ టీకాకు డబ్లుహెచ్వో ప్రకటించిన అత్యవసర యూజ్ లిస్టింగ్ లో ఇంకా చోటు దక్కలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడిస్తున్నారు.మరోవైపు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అమెరికా, యూకే లోని వైరస్ ను సమర్థవంతంగా ఎదురుకుంటుందని సంస్ద అధికారులు అంటున్నారు.
కానీ ఈ దేశాలు ఇలాంటి ఆంక్షలు పెట్టడంతో చాలా మంది సందేహిస్తున్నారట.మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అధికారులే తెలపాలి.