ఉప్పెన సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు.
వైష్ణవ్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా ప్రేక్షకుల చేత మార్కులు వేయించుకుని రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయాడు.ఈ సినిమాకు బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించారు.
ఉప్పెన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఉప్పెన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈమె కూడా ఆకట్టుకునే అందంతో, మంచి నటనతో ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.ఉప్పెన సినిమాలో బేబమ్మగా మంచి గుర్తింపు తెచ్చుకుని కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది కృతి శెట్టి.
ఈ సినిమా తర్వాత కృతికి వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.
యంగ్ హీరోల సినిమాలకు మంచి ఒప్షన్ గా కృతి మారిపోయిందని చెప్పాలి.ఒక్క హిట్ టోన్ స్టార్ స్టేటస్ అందుకుని వరస ఆఫర్ల తో టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి.
ఈమె నటనతో అదర గొడుతుంది కాబట్టి రెమ్యునరేషన్ విషయంలో కూడా అడ్డు లేకుండా పోయింది.నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈ అమ్మడు కూడా నటిస్తుంది.
అంతేకాదు రామ్ పోతినేని తో ఒక సినిమా, సుధీర్ బాబుతో మరొక సినిమా చేస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.తాజాగా ఈ అమ్మడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ తన మనసు లోని మాటలను పంచుకుంది.ఈమెకు అబద్దం చెప్పే వారంటే అస్సలు ఇష్టం ఉండదట.
అలంటి వారికి దూరంగా ఉంటానంటుంది ఈ బ్యూటీ.