ఇండస్ట్రీలో అందరికి సుపరిచితుడు అయిన బీఏ రాజు తుది శ్వాస విడిచారు.ఆయన నిన్న రాత్రి గుండె పోటుతో మృతి చెందారు.
ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు పలువురు సంతాపం తెలియజేశారు.ఇండస్ట్రీలో అందరితో కూడా మంచి పేరు ఉన్న బీఏ రాజు మృతి పట్ల ఇండస్ట్రీతో పాటు మీడియా వర్గాలు కూడ ఆ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ సమయంలోనే ఆయన కుటుంబం గురించి కొందరు ఆరా తీస్తున్నారు.చాలా మందికి తెలియని విషయం ఏంటీ అంటే బీఏ రాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇద్దరు కుమారుల్లో ఒకరు శివ కుమార్ బి.ఈయనే బీఏ రాజు చనిపోయిన వార్తను ట్విట్టర్ ద్వారా అందరికి తెలియజేశారు.
తండ్రి చనిపోయిన సమయంలో ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈయన ఆ వెంటనే జరగాల్సిన పనులు కూడా పూర్తి చేశారు.మద్యాహ్నంకు బీఏ రాజు అంత్య క్రియలను కూడా పూర్తి చేయడం జరిగింది.
బీఏ రాజు తనయుడు శివ కుమార్ దర్శకుడిగా ఒక సినిమాను తెరకెక్కించాడు.
సినిమాలపై ఆసక్తితో శివ కుమార్ చాలా కాలంగా సహాయ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
పూరి జగన్నాద్, వివి వినాయక్ వద్ద సహాయ దర్శకుడిగా వ్యవహరించిన శివ కుమార్ సొంతం గా 22 అనే సినిమాను చేశాడు.ఆ సినిమా గత ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు హడావుడి చేశారు.
ప్రభాస్ తో టీజర్ ను విడుదల చేయించారు.ఇండస్ట్రీ ప్రముఖులను తీసుకు వచ్చి ప్రమోషన్ చేశారు.
కాని సినిమా మాత్రం పెద్దగా ఆడిన దాఖలాలు లేవు.ప్రస్తుతం సూపర్ హిట్ మ్యాగజైన్ తో పాటు తండ్రి పీఆర్ఓగా వ్యవహరిస్తున్న సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాడు.
ఇంకా ఇతర వ్యాపారాలు కూడా శివ కుమార్ చేస్తున్నాడు.త్వరలో దర్శకుడిగా రెండవ సినిమాను మొదలు పెట్టాలని కూడా ఆయన భావిస్తున్నాడట.
త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.