గత ఏడాది లాక్ డౌన్ సమయంలో నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ చేసిన కామెంట్లు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సంగతి తెలిసిందే.కాగా నిన్న డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించడం తో ఈ వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుధాకర్ మృతిపట్ల సంచలన కామెంట్ చేశారు.
ప్రభుత్వాన్ని మాస్క్ అడగటమే దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ చేసిన నేరంగా జగన్ రెడ్డి ఆదేశాలతో ఆయన రెక్కలు విరిచి చిత్రహింసలు పెట్టి పిచ్చాసుపత్రిలో ఆయన్ని జాయిన్ చేయటంతో ఆయన కుంగిపోయారు అని లోకేష్ తెలిపారు.
కక్షగట్టి ఒక సామాన్య వైద్యుడిని వెంటాడి వేధించి చివరాకరికి అంతమొందించారు.ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని.గుండెపోటు కాదు అని అన్నా.ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు చేసిన హత్య ఆయన మృతి పట్ల పలువురు ఆరోపిస్తున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు.