రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్కు 8,841 ఎకరాలు కేటాయించడం.భూములు తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేందుకు అనుమతులిచ్చారని, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా ఉన్న బీపీ ఆచార్య పై సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే బీపీ ఆచార్యను నిందితుడిగా చేర్చిన సీబీఐ 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ నేపధ్యంలో ఆచార్య తనపై సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా బీపీ ఆచార్య పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడం తో ఆచార్య గతంలో హైకోర్టును ఆశ్రయించి నిర్ణయం వెలువడే వరకు విచారణ నిలిపి వేయాలని స్టే పొందిన విషయం తెలిసిందే.