ఏపీ సీఎం జగన్ కార్యాలయం వద్ద గందరగోళం.. !

కరోనా నేపధ్యంలో సమాజంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఎవరి బాధ ఎవరు వినే పరిస్దితుల్లో లేరు.

 Thadepalli, Cm Ys Jagan, Camp Office, Couple Suicide,latest News-TeluguStop.com

ఒకరకంగా చెప్పాలంటే మనుషుల జీవితాలు అల్లకల్లోలంగా మారాయని చెప్పవచ్చూ.ఇలాంటి స్దితుల్లో ఆర్ధిక సమస్యలు మధ్య తరగతి వారిని వేధిస్తున్న అంశంగా పేర్కొనవచ్చూ.

చాలీ చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న వారి కుటుంబాలను పూర్తిగా దిగజార్చంది ఈ మాయదారి కరోనా.

ఇకపోతే ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న కృష్ణా జిల్లాకు చెందిన భార్యాభర్తలు సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వినిపించుకుని సహయాన్ని ఆర్ధించాలని భావించారు.

ఈ క్రమంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.అయితే కరోనా నిబంధనల ప్రకారం ప్రస్తుత సమయంలో ముఖ్యమంత్రిని కలవడం కుదరదని, వినతి పత్రం ఇస్తే దానిని సీఎంకు అందిస్తామని అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తెలిపారట.

దీంతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో వారిద్దరూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.వారి చర్యను అడ్దుకున్న పోలీసులు ఆ దంపతులను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌ కు తరలించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube