చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్ అంటే తెలియని వారుండరు.ఈ దర్శకుడు టాలీవుడ్ లో జీన్స్, ఒకే ఒక్కడు, జెంటిల్ మెన్, భారతీయుడు, అపరిచితుడు, ‘ఐ’ రోబో, వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నాడు.
అదీగాక రామ్ చరణ్ తో పాటుగా, రణవీర్ సింగ్ తో కూడా మూవీకి కమిట్ అయ్యాడట.కాగా కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రం కూడా సెట్పై ఉంది.
ఇకపోతే దర్శకుడు శంకర్ చిత్రం అంటే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది.ఈ మధ్య కాలంలో అయితే ఈయన వాడుతున్న గ్రాఫిక్స్కు చిన్నపిల్లలు కూడా ఫిదా అవుతున్నారు.ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు శంకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి ఎస్.ముత్తు లక్ష్మి (88) వయోభార సమస్యలతో ఈ రోజు మరణించారు కాగా చెన్నైలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నేపధ్యంలో ముత్తు లక్ష్మి మృతికి పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.