దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న ఈ సమయంలో సోనూసూద్ పేరు విసృతంగా వినిపిస్తుంది.ఆయన ఆక్సీజన్ నుండి మొదలుకుని ఆసుపత్రి బెడ్స్ వరకు ఎన్నో అందిస్తున్నాడు.
డబ్బు పెట్టే స్థోమత ఉన్న వారికి కూడా ఆక్సీజన్ అందండం లేదు.కొందరు బెడ్ లేక మృతి చెందుతున్నారు.
దాంతో వారికి సాయంగా నిలిచేందుకు సోనూ సూద్ ముందుకు వస్తున్నాడు.ఎంతో మందికి సాయంగా నిలిచిన సోనూసూద్ పేరు తో మోసాలకు పాల్పడుతున్న వారి గుట్టు రట్టు అయ్యింది.
దేశ వ్యాప్తంగా ఆయనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు.సోనూ సూద్ ఛారిటబుల్ ట్రస్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా సాయం చేస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పుడు ఆ పేరు చెప్పి కొందరు ఫండ్స్ ను వసూళ్లు చేస్తున్నారు.సోనూ సూద్ తో కలిసి మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూ సూద్ కు అండగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కాని ఆయన్ను నిరాశ పర్చే విధంగా ఆయన్ను ఇబ్బంది పెట్టే విధంగా అస్సలు ప్రవర్తించవద్దంటూ కొందరు అంటున్నారు.డబ్బులు వసూళ్లు చేస్తూ ఆయన కు ఈ సమాజంపైనే నిరాశ కోపం కలిగేలా చేయవద్దంటూ కొందరు సూచిస్తున్నారు.
సోనూసూద్ పేరుతో మంచి చేయకున్నా పర్వాలేదు కాని జనాలకు చెడు చేసి ఆయన పేరును చెడగొట్టవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.దేశంలో ఎక్కడ ఇబ్బంది ఉన్న విషయం తన దృష్టికి వచ్చినా కూ డా వెంటనే వారికి సాయంగా నిలుస్తున్న సోనూసూద్ రియల్ హీరో.
ఆయన్ను సమాజంలో కించ పర్చే విధంగా ఆయన పేరుతో మోసం చేయవద్దు.