మంత్రి గంగుల కమలాకర్ కు, మాజీ మంత్రి ఈటెలకు మొదటి నుండి ఆధిపత్య పోరు ఉందనే తెలిసిందే.అయితే అప్పట్లో ఇద్దరు ఒకే పార్టీలో ఉండటంతో కొన్ని కొన్ని సార్లు ఇద్దరి మధ్య కొన్ని లకలుకలు వచ్చినా అధిష్టానం ఇద్దరికి సర్ది చెప్పడంతో కొన్ని రోజులు ఆ విషయం సద్దుమణిగింది.
అయితే ఇప్పుడు ఈటెలను కేసీఆర్ భర్తరఫ్ చేయడంతో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలను గంగుల నడిపిస్తున్నారు.అయితే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలెవరూ టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా చూడాలని మంత్రి గంగులను కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన గంగుల ఈటెల వర్గం నేతలతో భేటీ అవుతూ హుజురాబాద్ టీఆర్ఎస్ క్యాడర్ చేజారకుండా హామీలు కురిపిస్తున్నాడు మంత్రి గంగుల కమలాకర్.అయితే ఈ వ్యవహారాన్ని ఓ కంట కనిపెడుతున్న ఈటెల ఇక రివర్స్ గేర్ వేసే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇప్పటికే ఈ గంగుల ప్రతి అడుగును కార్యకర్తల నుండి సమాచారాన్ని సేకరిస్తున్న ఈటెల రాజేందర్ మంత్రి గంగుల చేస్తున్న ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు గంగుల వర్సెస్ ఈటెల అన్నట్లుగా కరీంనగర్ జిల్లా రాజకీయం జరుగుతోంది.
మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందనేది చూడాల్సి ఉంది.