తప్పు చేసిన వారు ఎంతటి వారైన చట్టం దృష్టిలో నేరస్దులే.కాని కొందరు అధికార బలంతో, డబ్బు బలంతో కేసులను పక్కదారి పట్టిస్తారు.
అలాంటి వారు ఎక్కువ కాలం దాగలేరు.చేసిన నేరం అప్పటి వరకు కాపాడిన ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించ వలసిందే.
అయిన సాటి మనిషిని చంపే అంత ద్వేషం పెంచుకోవడం మనుషుల మూర్ఖత్వానికి పరాకాష్ట.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం రెజ్లర్ సుశీల్ కుమార్ తన తోటి జూనియర్ రెజ్లర్ హత్య కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
అప్పటి నుండి తెలివిగా తప్పించుకుంటున్న సుశీల్ కుమార్ తలపై ఢిల్లీ పోలీసులు రివార్డు ప్రకటించారు.సుశీల్ ఆచూకి తెలిపినా లేదా ఇతన్ని పట్టించినా రూ.లక్ష నజరానాను అందజేస్తామని పేర్కొన్నారు.అంతే కాకుండా ఈ హత్యలో ఉన్న మరో నిందితుడు అజయ్ పై కూడా రూ.50 వేల నజరానా ప్రకటించారు.ఇకపోతే సుశీల్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరి పై కూడా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.