ఒకప్పుడు ఏదైనా వింత కాని, ఎప్పుడూ ఎక్కడ జరగనిది జరిగింది అని జనాలకు తెలియడానికి చాలా సమయం పట్టేది.ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలా అప్పుడు సోషల్ మీడియా అనేది లేదు.
అందుకే ఏ విషయామైనా పేపర్లో వచ్చినా అది ఒక చిన్న బాక్స్ లో ప్రచురించేవారు.పేపర్ ను క్షుణ్ణంగా చదివిన వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది.
కాని ఇప్పుడు అప్పటి పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా హవా నడుస్తోంది.
సాంకేతిక విప్లవం తరువాత సోషల్ మీడియా ఆధారంగా ప్రభుత్వాలు స్థాపించబడుతున్నాయంటే సోషల్ మీడియా ఎంతలా ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలలో చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది.
ఇక ఆ విషయం క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేసి ఇక ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.ఇక అసలు విషయం లోకి వెళ్తే కర్ణాటకలోని కొల్లూరులో ఒకే మండపంలో ఇద్దరికి తాళి కట్టి వివాహమాడిన ఘటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
వరుసకు మామయ్య అయ్యే వరుడు సుప్రియ, లలితలను వివాహమాడాడు.అయితే వీరు దివ్యాంగులు కావడంతో ఇరు కుటుంబాలు ఇద్దరికి ఒకే సారి పెళ్లి చేయాలని నిర్ణయించాయి.
ఇదేమి వింత పెళ్లి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.