గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఇదే కావచ్చూ.ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రజలను బాధిస్తున్న సమయంలో కూడా ఈ రాష్ట్ర నేతలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం మానుకోవడం లేదు.
గత కొద్ది రోజుల నుండి కరోనా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడనే ఆరోపణలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.కాగా తాజాగా ఇలాంటి ఆరోపణలతోనే ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పై కూడా కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశాడట కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగులకు చెందిన న్యాయవాది భూక్య మల్లికార్జునరావు.
ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా వైరస్లోని ఎన్ 440k రకం వ్యాపిస్తోందని మంత్రి చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని న్యాయవాది భూక్య మల్లికార్జునరావు పొలీసులకు విన్నవించుకుంటూ మంత్రిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం.