మానవత్వం అనేది స్దాయిని బట్టి ఉండేది కాదు.అలాగని స్వార్ధంతో సహాయం చేస్తే అది మానవత్వం అనిపించుకోదు.
ముఖ్యంగా రాజకీయ నాయకులు దాదాపుగా సేవ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ లబ్ధిపొందాలని చూస్తారు.
ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే ఆ ఆలోచన వెనక ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం పొందాలనే ఆరాటం ఉంటుదని ఆలోచిస్తారు ప్రజలు.
అందులో ఈ కరోనా సమయంలో ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు తమ సొంత ఖర్చుతో ప్రజలకు సహాయం చేసినట్టుగా వినబడలేదు.ఏమన్న అంటే ప్రభుత్వమే అన్నీ చూసుకుంటుంది.
ఈ పధకాన్నీ ప్రభుత్వం అమలు చేస్తుందని అంటారే గానీ, ఆ పధాకాలను పంది కొక్కుల్లా మేస్తున్న నేతలే ఎక్కువగా పొలిటికల్లో కనిపిస్తారు.
ఇకపోతే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గానీ, ఇతర శాఖల మంత్రు గానీ ప్రజల కోసం ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే ఇలాంటి ముఖ్య మంత్రి మన రాష్ట్రానికి ఎందుకు లేడు అని బాధగా అనిపిస్తుంది.
చేతగానీ, చేవ లేని నేతల వల్ల ప్రజలకు ఒరిగేది ఏం ఉండదు.ఇకపోతే మొదటిసారి ఒక మంత్రి తన ఇంటిని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చడం ఆశ్చర్యం కలిగించే విషయం.
అతనే కర్ణాటక హోంమంత్రి బసవరాజు బొమై కరోనా కాలంలో హాస్పిటల్లో బెడ్స్ దొరక్క ప్రజలు ఇబ్బందులు పడటం చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.నిజంగా మీ సేవా దృక్పథానికి హ్యాట్సాఫ్ సార్ అని అనకుండా ఉండలేక పోతున్నారట ఈ విషయం తెలిసిన వారు.