ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. వారందరికి ఉచిత రిచార్జ్.. !

కరోనా మనుషులకు గుణపాఠాన్ని నేర్పడానికి వచ్చిందని కొందరు భావిస్తున్నారు కానీ ఈ మహమ్మారి వైరస్ ఎక్కడ లేని కష్టాలను ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారికి రుచి చూపిస్తుంది.ఈ వైరస్ వ్యాప్తి వల్ల జరుగుతున్న నష్టం మాటల్లో చెప్పలేకుండా ఉంది.

 Bumper Offer For Airtel Customers Covid-19, Second Wave, Bumper Offer, Airtel Cu-TeluguStop.com

అసలే మధ్యతరగతి బ్రతుకులు అంతంత మాత్రమే.

ఇక అన్ని రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ వల్ల పేదల బ్రతుకులు ఆకలితో అలమటించే రోజులు వచ్చాయి.

కొందరికైతే పిడికెడు అన్నం కూడా కరువై పోయింది.ఇలాంటి సమయంలో ఎవరికి తోచిన విధంగా వారు సహయం చేస్తున్నా అవి పేదల వరకు చేరడం లేదన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది.కాగా చాలా మంది మొబైల్‌ వినియోగదారులు సెకండ్‌ వేవ్‌ కారణంగా తమ ప్లాన్లను రీచార్జి చేయించుకోలేకపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ఈ కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు.అంతే కాకుండా రూ.79 రీచార్జ్‌ కూపన్‌ కొనుగోలు చేసిన వారికి కూడా ప్రస్తుతం రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి కంపెనీ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube