కరోనా కేసులు నియంత్రించేందుకు తెలంగాణా రాష్ట్రంలో 10 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.లాక్ డౌన్ టైం లో ఎవరు బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అయితే లాక్ డౌన్ టైం లో బయట తిరుగుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ బేగం పేట లో పోలీసులు అడ్డుకున్నారు.అయితే రేవంత్ రెడ్డి దీనిపై తీవ్రంగా మండిపడ్డారు.
పేదలకు అన్నం పెట్టేందుకు వెళ్తుంటే తన వాహనాన్ని ఆపారని మండిపడ్డారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ హాస్పిటల్ వద్ద పేదలకు అన్నం కూడా పెట్టకూడదా అంటూ ఫైర్ అయ్యారు.
ఇది ప్రభుత్వ కుట్ర అని.పేదవాడి ఆకలిపై రాజకీయం ఏని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కంటోన్మెంట్ ఏరియాలో కోవిడ్ కేంద్రంగా మార్చిన ఓ హాస్పిటల్ వద్ద జరిగే పనులను తాను పర్యవేక్షించాల్సి ఉంది.అలాంటిది నన్ను ఆపడం అంటే గరీబోడి నోటి కాడ కూడు లాగేసే ప్రయత్నమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గమని అన్నారు రేవంత్ రెడ్డి.తానొక ఎంపీనని చూడకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదని.ఇది ముమ్మాటికి ప్రభుత్వ చర్యే అని అన్నారు రేవంత్ రెడ్డి.