దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నియంత్రణలో భాగంగా ఈ నెల 17 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ వల్ల కేసులు తగ్గినట్టుగా గుర్తించగా లాక్ డౌన్ ను మరో వారం రోజులు పొగిడిస్తున్నట్టు ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం.
రెండు వారాల లాక్ డౌన్ ద్వారా ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టింది.అందుకే మరో వారం రోజులు ఈ లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక వర్తక సంఘ ప్రతినిధుల కోరిక మేరకు షాపులను క్రమ పద్ధతిలో తెరచుకునే విధంగా అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది.అయితే కరోనా కంట్రోల్ అయ్యే వరకు లాక్ డౌన్ ను కొనసాగించాలని మాత్రం కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్తుంది.
లాక్ డౌన్ కు ముందు కేసులు తీవ్రత అధికంగా ఉండగా లాక్ డౌన్ వల్ల అది తగ్గిందని వైద్య అధికారులు చెబుతున్నారు.కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుందని తెలుస్తుంది.
ఢిల్లీలో 24వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించారు.అయితే ఈ లాక్ డౌన్ మళ్లీ కొనసాగిస్తారా లేదా అన్నది తెలుస్తుంది.
ఢిల్లీ ప్రజలు కూడా లాక్ డౌన్ కు సహకరిస్తూ లాక్ డౌన్ టైం లో ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తున్నట్టు తెలుస్తుంది.