కరోనా సెకండ్ వేవ్ తీవ్రత దారుణంగా ఉంది.మహమ్మారి వల్ల రోజు రోజుకి కేసులతో పాటుగా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఇక ఇప్పటికే దేశంలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడగా లేటెస్ట్ గా మరో ఎంట్రన్స్ ఎక్సామ్స్ వాయిదా పడినట్టు తెలుస్తుంది.తాజాగా హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ తో పాటుగా దేశ వ్యాప్తంగా జరగాల్సిన లా యూనివర్సిటీలో జరగాల్సిన క్లాట్ 2021 పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.
జూన్ 13న జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ పరీక్ష ఎప్పుడు పెడతారన్నది త్వరలో తేదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.
అంతేకాదు లాస్ట్ డేట్ ని సైతం మార్చారు.జూన్ 15న వరకు దరఖాస్తులను తీసుకుంటారని తెలుస్తుంది.
కరోనా ఎఫెక్ట్ తో ఇంకా ఎన్ని పరీక్షలు వాయిదా పడతాయో చూడాలి.ప్రవేశ పరీక్షలే కాదు యానువల్ ఎక్సామ్స్ కూడా వాయిదా వేస్తుండగా ఎంట్రన్స్ ఎక్సాంస్ కూడా వాయిదా వేస్తున్నారు.
కరోనా వల్ల దేశంలో జరగాల్సిన అన్ని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేశారు.అయితే కేసులు పెరుగుతున్న కారణంగా ఈ పరీక్షలు ఎప్పుడు నిర్ణయిస్తారు అన్నది మాత్రం నిర్ణయించాల్సి ఉంది.