ఫిదా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ సాయి పల్లవి.మొదటి సినిమాతోనే అటు డాన్స్ ఇటు పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసి అందరి దృష్టిని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకుంది.
ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకులు కూడా సాయి పల్లవి డేట్స్ కోసం క్యూ కట్టారు.అయితే ఈ బ్యూటీ మాత్రం రెగ్యులర్ కమర్షియల్ కథలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.
కేవలం తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న కథలని మాత్రమే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.ఈ నేపధ్యంలో తెలుగులో ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఫిదా తర్వాత ఏంసీఏ, పడిపడి లేచే మనసు సినిమాలు మాత్రమే చేస్తుంది.
ప్రస్తుతం లవ్ స్టొరీ, విరాటపర్వం సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యి ఉన్నాయి.ఈ సినిమాలలో కూడా ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది.
అయితే ఫిదా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఆమె ఐదు సినిమా అవకాశాలని వదులుకుంది.
దీంతో ఆమె రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఐదు కోట్ల వరకు వదులుకోవడంతో పాటు కమర్షియల్ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలని కూడా కోల్పోయింది.
అందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా ఉంది.అలాగే అయ్యప్పన్ కోషియం రీమేక్ తో పాటు అలాగే బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ ఆఫర్స్ ని రిజక్ట్ చేసింది.
వీటితో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో ఆఫర్స్ వచ్చిన కూడా వాటిని కూడా సున్నితంగా చేయలేనని చెప్పి తప్పుకుంది.అయితే ఈ ఆఫర్స్ వదులుకోవడం ద్వారా సాయి పల్లవి బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పాలి.
కమర్షియల్ హీరోయిన్ కాలేకపోయిన తెలుగులో ఈ మధ్యకాలంలో బెస్ట్ హీరోయిన్ జాబితాలో మాత్రం సాయి పల్లవి చోటు దక్కించుకుంది అనే మాట బలంగా వినిపిస్తుంది.