ఈ కరోనా వల్ల మనషుల మనస్తత్వాలు బయటపడుతున్నాయి.సహాయం చేసే వారు ఎవరు.
ప్రజల కష్టాన్ని కరోనా పేరు చెప్పి దోచుకునే వారు ఎవరు అనేది ప్రజలకు క్షుణంగా అర్ధం అవుతుందట.ఇకపోతే కోవిడ్ బాధితులకు కొందరు ప్రత్యక్షంగా సహాయం చేస్తుంటే మరికొందరు పరోక్షంగా సహాయ పడుతున్నారు.
అంతే కాదు ఈ కరోనా మనుషుల మధ్య ఉన్న బేధాలను, స్దాయిని కూడా మరిపించేస్తుంది.అందుకు ఉదాహరణ మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్ జిర్లియానా.
ఈయనతో పాటుగా మంత్రి భార్య, కుమారుడికి సైతం కరోనా పాజిటివ్ రాగా ఐజ్వాల్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో మంత్రి చికిత్స పొందుతున్న గది అపరిశుభ్రంగా ఉండడం గమనించి ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బందికి ఫోన్ చేశారట.కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గదిలో ఫ్లోర్ ను స్వయంగా శుభ్రం చేసుకున్నారట.
ఈ సందర్భంగా తాను మంత్రినైనా, మామూలు మనిషినే, అవసరమైనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పుగా భావించడం లేదని వెల్లడించడం విశేషం.ఇకపోతే మిజోరం విద్యుత్ శాఖ మంత్రి గా ఉన్నా కూడా తన అధికారమదాన్ని ప్రదర్శించకపోవడం లాల్ జిర్లియానా చెల్లింది.