సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలైనా ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.అయితే చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా అంతకంతకూ ఎదుగుతూ వచ్చారు.
ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
అయితే చిరంజీవి నటుడిగా ఈ స్థాయికి ఎదుగుతాడని ఒక దర్శకుడు మాత్రం ముందుగానే జోస్యం చెప్పారు.
ఆ దర్శకుని జోస్యం నిజం కావడంతో పాటు చిరంజీవి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు.
చిరంజీవి, మోహన్ బాబు కలిసి బిల్లా రంగా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కే.ఎస్.ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కే.ఎస్.ఆర్.దాస్ ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ లా చిరంజీవి కూడా పాపులారిటీ సంపాదించుకుంటారని చెప్పగా ఆయన మాటలే నిజమయ్యాయి.ఒకసారి దర్శకుడు చిరంజీవి వీపుపై ఉన్న పెద్ద పుట్టుమచ్చను గమనించారు.సీనియర్ ఎన్టీఆర్ కు కూడా అదే విధంగా మచ్చ ఉండటంతో కే.ఎస్.ఆర్ దాస్ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉంటుందని మెగాస్టార్ తో అన్నారు.
మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైన తరువాతే కొత్త సినిమాలను మొదలుపెట్టాలని భావిస్తున్నారు.రీఎంట్రిలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
లూసిఫర్ రీమేక్ తో పాటు వేదాళం రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నారు.లూసిఫర్ రీమేక్ కు డైరెక్టర్ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.
మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.