వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే.ఉద్దేశపూర్వకంగా కులాల మధ్య మరియు మతాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కొన్ని మీడియా ఛానల్స్ తో చేతులు కలిపి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేయడం జరిగింది.
శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో రఘురామకృష్ణంరాజు ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.బెయిల్ కోసం రఘురామకృష్ణంరాజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో విచారణ జరపగా .హైకోర్టు చివరాకరికి రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది.
విచారణ ప్రారంభం అయిన వెంటనే.నేరుగా హైకోర్టులో రావటం ఏంటి.? సిఐడి జిల్లా కోర్టులో తేల్చుకోవాలి కదా అని న్యాయస్థానం పేర్కొంది.ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారని రఘురామకష్ణంరాజు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే తరహాలో పాల్పడ్డారని.వాదనలు వినిపించారు.దీంతో వెంటనే హైకోర్టు వైసీపీ రెబల్ ఎంపీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది.
ఈ కేసులో జోక్యం చేసుకోలేమని .బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు.