వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.రఘురామకృష్ణంరాజు కి మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీకి చెందిన కీలక నాయకులు రంగంలోకి దిగి అరెస్టు చేసిన విధానాన్ని ఖండించారు.
పరిస్థితి ఇలా ఉండగా యాక్టర్ శ్రీరెడ్డి కూడా తాజాగా రఘురామకృష్ణంరాజు అరెస్టు పట్ల స్పందించారు.రఘురామకృష్ణంరాజు అరెస్టు నీ సమర్థిస్తూ శ్రీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసింది.
సీబీఐ రఘురామకృష్ణంరాజు క్రిమినల్, ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసిందని తెలిపింది.బ్యాంకులను మోసం చేసి ఇన్ని కేసులు పెట్టుకుని నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడతావా అంటూ రఘురామకృష్ణంరాజు తన పై గతంలో చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి సీరియస్ కౌంటర్లు వేసింది.
బ్యాంకులను మోసం చేసి ప్రజల డబ్బును కాజేసి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు మీరు వెళ్లి పోతే ఆ టాక్స్ మా మీద పడుతోంది.దీంతో దేశంలో మధ్యతరగతి సామాన్య ప్రజలు మీ లాంటి వాళ్ళ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని సీరియస్ అయింది.
ఈ విధంగా బ్యాంకులను మోసం చేసే బదులు రైల్లో అటు ఇటు తిరుగుతూ డబ్బు సంపాదించవచ్చు కదా అంటూ రఘురామ కృష్ణంరాజు కి సూచించింది.పేదవాళ్లుమధ్యతరగతి వాళ్ళు దాచుకున్న డబ్బు పై ఎందుకు అంత మమకారం .ఈ విధంగా ఎందుకు బ్యాంకులను మోసం చేస్తారు అంటూ శ్రీ రెడ్డి భారీ డైలాగులు వేసింది.
.