టాలీవుడ్ నుండి ఏప్రిల్ మరియు మే నెలల్లో భారీ ఎత్తున సినిమా లు విడుదల అవ్వాల్సి ఉన్నాయి.టక్ జగదీష్ నుండి మొదలుకుని అఖండ సినిమా వరకు మే నెల మొత్తం వరుసగా సినిమా లు విడుదలకు సిద్దం అయ్యాయి.
ఈ సమయంలో కరోనా సెండ్ వేవ్ మొదలు అయ్యి గత నెల రోజులుగా సినిమా లు ఏమీ లేకుండా పోయాయి.కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్ మొదటి రెండవ వారం నుండి మొదలు అవ్వడంతో వకీల్ సాబ్ కూడా కొంత నష్టపోవాల్సి వచ్చింది.
అందుకే ఇతర సినిమా లు ఏమీ కూడా విడుదలకు సిద్దం గా లేవు.ఈ సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ నిర్మాతలకు వందల కోట్ల నష్టం ను కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే విడుదులకు సిద్దం అయిన సినిమా ల నుండి మొదలుకుని విడుదల కావాల్సిన సినిమాలు మరియు షూటింగ్ దశలో ఉన్న సినిమాలు ఇలా అన్ని కలిపి భారీగా నిర్మాతలకు నష్టాలను మిగుల్చుతున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో పదుల కొద్ది సినిమాలు వరుసగా వాయిదా పడ్డాయి.
అవి వాయిదా పడటం వల్ల నిర్మాతలకు వారం వారం వడ్డీ రూపంలో భారం పడుతూనే ఉంది.కొన్ని సినిమా ల క్రేజ్ తగ్గడం వల్ల నష్టం కలుగుతుంది.
మరి కొన్ని సినిమాలు షూటింగ్ లు జరుగక పోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది.అలా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏకంగా 500 నుండి 600 కోట్ల వరకు టాలీవుడ్ నిర్మాతలకు నష్టం కలుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.
రికార్డ్ బ్రేకింగ్ సినిమా ను టాలీవుడ్ లో వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో ఉన్న సినిమా లు ఆచార్య, అఖండ ఇంకా పలు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. కేజీఎఫ్ 2 సినిమాను కూడా విడుదల వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇక రాధే శ్యామ్ సినిమా విడుదల విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయి.అలా ఈ సెకండ్ వేవ్ వందల కోట్లను టాలీవుడ్ నిర్మాతలకు మిగుల్చుతున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.