అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పుష్ప.ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది.
ఇటీవలే ఈ సినిమా రెండు పార్ట్ లు గా విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు పార్ట్ లు కూడా అత్యంత విభిన్నంగా రెండు పార్ట్ లకు రెండు పార్ట్ లు కూడా భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ఐటెం సాంగ్ ల విషయమై చర్చ జరుగుతోంది.ఈ సినిమా లో రెండు ఐటెం సాంగ్ లు ఉండబోతున్నాయని, రెండు పార్ట్ లకు రెండు ఐటెం సాంగ్ లతో దర్శకుడు సుకుమార్ కుమ్మేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆ విషయమై తాజాగా యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమా మొదటి పార్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతుందని రెండవ పార్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను చేయబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ లకు ఇప్పటికే ట్యూన్స్ ను రెడీ చేశాడని దేవిశ్రీ ప్రసాద్ గురించి ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మరియు సుకుమార్ ల కాంబోలో వచ్చిన సినిమాలు ఇప్పటికే భారీ ఎత్తున విజయాలను దక్కించుకున్నాయి.
కనుక ఈ సినిమా రెండు పార్ట్ లు కూడా తప్పకుండా భారీ విజయాన్ని దక్కించుకోవడంతో పాటు మ్యూజికల్ గా కూడా సక్సెస్ ఖాయం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.ఈ సినిమా లో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అనసూయ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో కనిపించబోతున్నారు.మొత్తంగా ఈ సినిమా లో భారీ ఎత్తున అందాల వింధు ఉండబోతుంది.