ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్రమైన రాజకీయ తుఫాను మొదలైందట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్తో దాదాపుగా ఏపీ ప్రభుత్వాన్ని మిమర్శించని ప్రతిపక్ష నేతలు లేరు.
కాగా రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో తాజా అరెస్ట్ రాజకీయ వర్గాల్లో మంటలు పుట్టిస్తోంది.
ఇక ఈ సెగ తెలంగాణ నేతల్లో కూడా వేడి రాజేసినట్లుగా ఉంది.
ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న ఆయన ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు రావడం.అరెస్ట్ చేయడం రాజకీయంగా దుమారంగా మారింది.
అయితే ఇదే విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రాణాల కోసం పోరాడుతున్న కరోనా పేషెంట్స్ అత్యవసర పరిస్దితుల్లో ఏపీ నుంచి హైదరాబాద్ ఆస్పత్రులకు అంబులెన్సుల్లో వస్తున్న క్రమంలో వారిని తెలంగాణ పోలీసులు సరిహద్దుల వద్ద అడ్డుకుంటున్నారు.
కానీ రఘురామ అరెస్టు విషయంలో వస్తున్న ఏపీ పోలీసులను అనుమతించడం దారుణమని అన్నారు.తన మిత్రుడు అయిన జగన్ కోసం కేసీఆర్ నిబంధనలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ఇకపోతే రఘురామ కృష్ణరాజు విషయంలో ఏపీ సర్కార్ అత్యుత్సహం ప్రదర్శిస్తోందని ప్రతిపక్షాలు ఎటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే.