టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్.ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరో స్థానంలో ఉన్న అఖిల్ సిసింద్రీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఈ సినిమాతో సంవత్సరం వయసులో ఉన్న బాలనటుడిగా నటించిన అఖిల్.బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలో నటించగా ఈ సినిమాలు అంత సక్సెస్ ఇవ్వలేదు.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా కంటే ముందు నటించిన సినిమాల్లో అంత సక్సెస్ అందుకోకపోగా ఈ సినిమాపై ఆశలు పెంచుకున్నాడు అఖిల్.ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా ప్రకటించగా ఈ సినిమా గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.లేదంటే ఇదివరకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది.ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో లైన్ లో ఉన్న అఖిల్ మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా గురించి కొరటాల శివను నాగార్జున కలిశారని, అఖిల్ తో సినిమా చేయించడానికి తను ఓకే అన్నట్లు కూడా తెలిసింది.మొత్తానికి అఖిల్ వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా ఇవి అఖిల్ కెరీర్ లో ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.