ఏదైనా విపత్తు కలిగినప్పుడు దాని నుండి బయట పడటానికి తల ఒక చెయ్యివేస్తే సులువుగా ఆ ఆపద నుండి గట్టెక్క వచ్చూ.అయితే ప్రస్తుతం దేశంలో వికృత నాట్యం చేస్తున్న కరోనా వల్ల కూడా ప్రజలు ఎంతగానో కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించే వారిలో సినీ పరిశ్రమకు చెందిన వారిని చెప్పుకోవచ్చూ.
ఈ క్రమంలో తమిళ రాష్ట్రం లో కోవిడ్ తీవ్రత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్పందించిన ఇక్కడి సినీ తారలు తమ వంతుగా విరాళాలను ప్రకటిస్తున్నారు.ఇప్పటికే హీరో అజిత్ రూ.25 లక్షలు, డైరెక్టర్ మురుగదాస్ రూ.25 లక్షలు, సూర్య, కార్తీ కలిసి రూ.కోటి సీఎం స్టాలిన్కు అందించగా.తాజాగా రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య కూడా తన భర్త విశాగన్ తరఫున రూ.కోటి విరాళంగా ఇచ్చారు.ఇకపోతే స్టాలిన్ సీయం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రజలపక్షాన నిలిచి కరోనా సమయంలో జనానికి మేలుచేసే కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.