ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల వద్ద చెక్ పోస్టులు దగ్గర తెలంగాణ పోలీసులు ఏ ప్రాంతానికి చెందిన అంబులెన్సులు ఆపడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.గతంలోనే ఈ తరహా విధానం తెలంగాణ ప్రభుత్వం అవలంబించటం తో.
తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.అంబులెన్స్ లు ఆపే హక్కు ఎవరికీ లేదని గట్టిగా కోర్టు చివాట్లు పెట్టింది.
ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన రాజకీయ నేతలు స్పందిస్తూ ఉన్నారు.
దీనిలో భాగంగా బిజెపి పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజా ఘటనపై స్పందించారు.
ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఓట్లు కావాలి.కాని వాళ్ళు ఇక్కడ వైద్యం చేయించుకోవాలని వస్తే ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ సీరియస్ కామెంట్లు చేశారు.
చెక్ పోస్టుల వద్ద వైద్యం కోసం వస్తున్న అంబులెన్స్ లు ఆపటం సరైన విధానం కాదని అన్నారు.పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్.
మెడికల్ హబ్ అని అంటారు అటువంటిది వైద్యం కోసం వస్తే రోగులను సరిహద్దుల వద్ద ఆపడం దారుణమని రాజాసింగ్ .తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆంబులెన్స్ లు ఆపడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.