బెల్లం, పెరుగు.ఈ రెండూ అద్భుతమైన రుచి కలిగి ఉండటమే కాదు బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తాయి.అందుకే వీటిని విరి విరిగా వాడతారు.
అయితే విడి విడిగా ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలుసు.అయితే కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు నిపుణులు.
మరి ఆ ప్రయోజనాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి కడుపు నొప్పి తీవ్రంగా వేధిస్తుంటుంది.
అప్పుడు ఏం చేయాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.అయితే ఆ సమయంలో పెరుగులో కొద్దిగా బెల్లం కలిపి తీసుకోవాలి.
ఇలా చేస్తే క్షణాల్లోనే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది.
అలాగే ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు, పిల్లలు రక్త హీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.అయితే ప్రతి రోజు ఒక కప్పు పెరుగులో కొద్దిగా బెల్లం పొడి కలిపి తీసుకుంటే.
శరీరానికి కావాల్సిన ఐరన్ మరియు ఇతర పోషక విలువలు పుష్కలంగా అందుతాయి.దాంతో రక్త హీనత తగ్గు ముఖం పడుతుంది.
బరువు తగ్గాలని ప్రయత్నించే వారు పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే.శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.అతి ఆకలి కూడా తగ్గుతుంది.ఇక పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే అలసట, నీరసం వంటి సమస్యలు దూరమై.ఫుల్ యాక్టివ్గా మారతారు.
జలుబు సమస్యతో బాధ పడే వారు పెరుగులో బెల్లం పొడి మరియు చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి తీసుకోవాలి.
ఇలా చేస్తే జలుబు సమస్య సూపర్ ఫాస్ట్గా పరార్ అవుతుంది.అదే సమయంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.