1.తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
ఒడిశా నుంచి తెలంగాణకు 120 మెట్రిక్ టన్నుల ద్రవ రూప ఆక్సిజన్ తెలంగాణకు రైల్ కంటైనర్ ద్వారా చేరింది.
2.అంబులెన్సులను అడ్డుకోవడం పై రేవంత్ ఆగ్రహం
ఏపీ నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే కరుణ రోగుల అంబులెన్సులను చెక్ పోస్టుల్లో అడ్డుకోవడం పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
3.‘ స్పుత్నిక్ వి ‘ ఇంపోర్టెడ్ ధర రూ.995
డ్రగ్ ఫర్మ్ డాక్టర్ రెడ్డీస్ ‘ స్పుత్నిక్ వి.’ వాక్సిన్ (ఇంపోర్టెడ్ ) ఒక్కో డోసు ఇండియా లో రూ.995 .40 కి లభ్యం కానుంది.
4.బ్లాక్ ఫంగస్ తో మహారాష్ట్రలో కొత్త ఆందోళన
చాలా అరుదైన ప్రమాదకరమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యుకొర్ మైకొసిస్ (,బ్లాక్ ఫంగస్ ) మహారాష్ట్రలో కొత్త ఆందోళనకు దారి తీసింది.గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఈ ఫంగస్ కారణంగా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
5.ఈటెల వ్యవహారంపై జగ్గారెడ్డి రెస్పాన్స్
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.ఈటెల టిఆర్ఎస్ లది ఇంటి పంచాయతీ అని, దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
6 రాజ్ భవన్ లో ఐసోలేషన్ కేంద్రం
కరోనా బారిన పడిన ఉద్యోగుల కోసం పది పడకలతో రాజ్ భవన్ లో ఐసోలేషన్ కేంద్రాన్ని గవర్నర్ తమిళ సై ప్రారంభించారు.
7.టైమ్స్ గ్రూప్ చైర్మన్ మృతి
టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందు జైన్ ( 84) కరోనా కారణంగా మృతి చెందారు.
8.భారత్-ఆస్ట్రేలియా మధ్య విమాన రాకపోకలు ప్రారంభం
కరోనా నేపథ్యంలో నుంచి వచ్చే విమానాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
9.‘ పీఎం కిసాన్ ‘ ఎనిమిదో విడత సాయం విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎనిమిదో విడత ఆర్థిక సహాయం ను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
10.అరేబియా సముద్రంలో అల్పపీడనం
అరేబియా సముద్రం లో సంభవించిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
11.2021 చివరి నాటికి అందరికీ అందరికీ వాక్సిన్
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వి కె పాల్ తెలిపారు.
12.18 ఏనుగుల అనుమానాస్పద మృతి
అసోంలోని అటవీ ప్రాంతంలోని 18 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
13.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,43,144 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
14.ఏపీకి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్
ఏపీలో మెడికల్ ఆక్సిజన్ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఏపీకి రానుంది.పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి 40 టన్నుల ఆక్సిజన్ నింపుకుని ఏపీ కి బయలుదేరింది.
15.అంబులెన్స్ ల నిలిపివేతపై హౌస్ మోషన్ పిటిషన్
ఏపీ నుంచి తెలంగాణా కు వెళ్లేందుకు అనుమతి లేని ఆంబులెన్స్ రామాపురం క్రాస్ చెక్పోస్టు వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు దీనిపై విశ్రాంత ఐఏఎస్ అధికారి వెంకట కృష్ణారావు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
16.రచయిత నంద్యాల రవి మృతి
ప్రముఖ సినీ రచయిత నంద్యాల రవి కరోనాతో మృతి చెందారు.
17.కోవిడ్ బాధితులకు కోటి విరాళం
ప్రముఖ తమిళ హీరోలు సూర్య, ఆయన సోదరుడు కార్తి కలసి కోవిడ్ బాధితులను ఆదుకోవాలంటూ కోటి రూపాయల చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందించారు.
18.పుల్లురు టోల్ గేట్ వద్ద ఏపీ వాసులు ఆందోళన
తెలంగాణ పరిధిలోని పుల్లూరు టోల్ గేట్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ఏపీ వాసుల కొద్దిసేపు ఆందోళనకు దిగారు.ఏపీ నుంచి అంబులెన్సులకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో తెలంగాణ వాహనాలను ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు.
19.తెలంగాణ లో బ్లాక్ ఫంగస్
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ వైరస్ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందారు.
నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ కు చెందిన వ్యక్తి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతూ మృతి చెందారు.అయితే దీనిని సంబంధిత వైద్య వర్గాలు నిర్ధారించడం లేదు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,850
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 45,850
.