రంజాన్ పండగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు.
ఈ మేరకు ఈద్ గెటప్లో ఓ వీడియోని విడుదల చేశారు.వీడియోలో ఆయన మాట్లాడుతూభక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్షలు ఉంటూ ముస్లిం సోదరులు తమ ఇష్టదైవాన్ని కొలవడం ఆదర్శప్రాయమని చెప్పారు.
అల్లా కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని బాలకృష్ణ అకాంక్షించారు.సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని అన్నారు.
అత్యంత కఠోరమైన ఉపవాస దీక్షలను నెలరోజుల పాటు పాటించడం ఇస్లాం గొప్పదనాన్ని చాటుతోందని చెప్పారు.‘ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు.
త్యాగానికి, సేవానిరతి మారుపేరు రంజాన్ పవిత్ర మాసం.ఎంతో భక్తి శ్రద్దలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం.
అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను.మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ.
మీ బాలకృష్ణ.’ అని రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు.
మరో వైపు బాలయ్య సినిమా విషయాలు చూసినట్లైతే బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమాను ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.
దీంతో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న కొత్త షెడ్యూల్ను మొదలు పెట్టనున్నారట చిత్రబృందం.దేశంలో కోవిడ్ కారణంగా అన్ని పెద్ద సినిమాలకు బ్రేకులు పడ్డాయి.టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ ఇంకా పెద్ద హీరోలంతా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు.సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని గ్యాప్ ఇచ్చారు.
అయితే ఆ మధ్య ఆగిన నందమూరి బాలకృష్ణ చిత్రం అఖండ షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే యోచనలో చిత్ర యూనిట్ సన్నద్దమవుతోంది.