ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉండటంతో కరోనా కట్టడి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తాజా పరిస్థితుల బట్టి అర్థమవుతుంది. మేటర్ లోకి వెళ్తే మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంబులెన్స్ లు.చెక్ పోస్టుల వద్ద ఆపేస్తున్నారు.
గతంలో ఈ తరహా లోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించగా తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.
సరిహద్దుల వద్ద ఆంబులెన్స్ లు ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే అనుమతులు లేని ఆంబులెన్స్ లు తెలంగాణ పోలీసులు ఆపడంతో సరిహద్దుల వద్ద భారీగా అంబులెన్స్ లు ఆగిపోవటంతో చాలామంది.రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.
ఇద్దరు మృతి చెందినట్లు కూడా సమాచారం.ముఖ్యంగా కర్నూలు జిల్లా పుల్లూరు చెక్ పోస్ట్ వద్ద.
భారీగా నిలిచిపోయాయి.హైదరాబాద్ లో బెడ్ కన్ఫర్మ్ అయితేనే.
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతులు ఇస్తున్నారు.ఈ పరిణామంతో అంబులెన్స్ లో ఉన్న రోగులు అనేక అవస్థలు పడుతున్నారు.
.