మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సినిమా ఆచార్య.ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇందులో రామ్ చరణ్ కు చిరంజీవికి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని టాక్.
చిరంజీవి 152 వ సినిమాగా రాబోతున్న ఆచార్య ను సోషల్ మెసేజ్ తో కొరటాల తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ‘సిద్ద’ అనే పేరుతో విద్యార్థి సంఘానికి నాయకుడిగా నటిస్తున్నాడు.ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించబోతుంది.ఈ సినిమాలో పూజ హెగ్డే నీలాంబరి పాత్రలో నటిస్తుంది.
వీరిద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తుంది.,/br>
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.ఈ సినిమాలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ సినిమాను వాయిదా వేశారు.
లేకపోతే ఈ సినిమా నిన్న అంటే మే 13 న విడుదల అయ్యి ఉండేది.ఈ సినిమా వాయిదా పడడంతో మెగా అభిమానులు నిరాశ పడ్డారు.
అన్ని బాగుంది ఉంటె ఈ పాటికి థియేటర్స్ దగ్గర సందడి ఒక రేంజ్ లో ఉండేది.,/br>
ఈ విషయాన్ని ఇప్పుడు మెగా అభిమానులు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు.
చెప్పిన విధంగా మే 13 న విడుదల అయ్యి ఉంటె ఈ పాటికే రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ మొదలయ్యేది.కానీ కరోనా కారణంగా పరిస్థితులు అన్నీ తలకిందులు అయ్యాయి.
పరిస్థితులు చెక్కబడిన తర్వాతే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.అప్పటి వరకు మెగా అభిమానుల్లో ఈ నిరాశ తప్పదు.