ప్రస్తుతం ప్రజలను తెగ చికాకు పెడుతున్న సమస్య కాలర్ ట్యూన్.మనిషి ప్రాణం పోతున్న సమయంలో సహయం కోసం చేస్తున్నప్పుడు కరోనా గురించి చెప్పే విషయాలు విని విని, దీనికోసం కాస్త టైం కూడా వేస్ట్ అవుతుండటంతో ఒక్కోసారి ఫోన్ నేలకేసి కొట్టాలన్నంత కోపం, బాధ కలుగుతుంది.
మరి ఈ విషయంలో ఆపరేటర్లు ఎందుకు స్పందిస్తలేరో అర్ధం కాదు.
ఇలా సమయాన్ని వ్యర్ధం చేస్తూ అనవసరంగా వాగుతున్న కరోనా కాలర్ ట్యూన్పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలే దేశంలో కోవిడ్ టీకాల కొరత ఉండటం వల్ల వ్యాక్సినేషన్ పక్రియ సజావుగా సాగడం లేదు.ఈ నేపధ్యంలో టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ వస్తున్న కాలర్ ట్యూన్ వల్ల టీకా ప్రజలకు ఎలా అందుతుందని, ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
దేశంలో సరిపడా వ్యాక్సిన్లు లేనప్పుడు ఫోన్ లో చిరాకుపరిచే ఆ కాలర్ ట్యూన్ ఎందుకని, ప్రజలను విసిగించడం మానుకోండని తీవ్రంగా మండిపడింది.