అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.తరువాత వరుస అవకాశాలతో ఈ అమ్మడు క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోయింది.
అయితే గ్లామర్ రోల్స్ కి దూరంగా పాత్ర ప్రాధాన్యత బట్టి సినిమాలు ఎంపిక చేసుకుంటూ నిత్యా మీనన్ టాలీవుడ్ లో తన కెరియర్ లో కొనసాగిస్తూ వస్తుంది.అయితే ఈ బ్యూటీ చాలా కాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉంది.
కాస్త లావుగా అవ్వడంతో పాటు తనకి సరిపడా పాత్రలు రాకపోవడంతో తెలుగులో సినిమాలు తగ్గించేసింది అని తెలుస్తుంది.అయితే తమిళ్, మలయాళీ బాషలలో సినిమాలు చేస్తుంది.
అయితే చాలా గ్యాప్ తర్వాత అయ్యప్పన్ కొషియమ్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.అయితే దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.ఇప్పుడు మరో సినిమా కోసం నిత్యా మీనన్ పేరు వినిపిస్తుంది.ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కొరటాల శివ నిత్యా మీనన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.గతంలో కొరటాల, ఎన్టీఅర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో నిత్యా మీనన్ ని హీరోయిన్ గా ఎంపిక చేశాడు.
మళ్ళీ ఎన్టీఆర్ సినిమా కోసం హీరోయిన్ గా కాకున్నా చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసమే ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.మెయిన్ హీరోయిన్ గా కియరా అద్వానీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.