టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా షూటింగులు వాయిదా పడగా ఈ సినిమా కూడా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు మహేష్ బాబు.రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపించగా.
ఈ ఏడాది ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించాలని.పైగా ఈ ఏడాది చివర్లోనే సెట్ లోకి వెళ్లనున్నట్లు కూడా సమాచారం అందింది.
ఇదిలా ఉంటే మహేష్ మరో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ అంటే మహేష్ అభిమానులకు పండగనే చెప్పవచ్చు.
ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో పలు సినిమాలు విడుదల కాగా.అవి అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
అంతే కాకుండా మంచి సక్సెస్ ను కూడా అందించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ను హారిక హాసిని క్రియేషన్స్ లో నిర్మించబడనుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను డిసైడ్ చేశారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో సీనియర్ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది.త్రివిక్రమ్ ఇప్పటికే ఆమెతో ఈ సినిమా గురించి చర్చించగా తను కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.ఇక ఇందులో శిల్పాశెట్టి ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపించడం వరకే కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.