టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు అందుకుంది.
తన అందంతో ఎంతోమంది హృదయాలను తాకింది.ఇదిలా ఉంటే ఈ మధ్య సినిమాలకు కాస్త దూరం అయ్యింది.
ఒకప్పుడు ఒక సంవత్సరానికి ఎన్నో సినిమాల్లో నటించే ఈ బ్యూటీ.ప్రస్తుతం అవకాశాలు రావట్లేవని చెప్పవచ్చు.
ఇటీవలే నిశ్శబ్దం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.కానీ ఆ సినిమా అనుష్కకు అంత సక్సెస్ ని ఇవ్వలేదు.ఇక అప్పటి నుంచి ఎటువంటి అవకాశాలు అందుకోకపోగా.తాజాగా అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది.
నిజానికి ఇప్పటికే అనుష్క ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని ప్రస్తుతం కరోనా వైరస్ కారణం వల్ల వాయిదా పడిందని తెలిసింది.
రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క సినిమా చేయనుందని వార్తలు వినిపించాయి.ఫన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ అనుష్కకు నచ్చడంతో.ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
అంతేకాకుండా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించనున్నట్లు, ఇందులో హీరో వయసు హీరోయిన్ కంటే తక్కువగా ఉండటంతో.వారిద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీ ని తెరకెక్కించాలనుకున్నారు.
ఇదిలా ఉంటే అనుష్క గురించి మరికొంత మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారని సమాచారం అందగా.తాజాగా ఓ క్రేజీ డైరెక్టర్ అనుష్కను కలిసి వెబ్ సిరీస్ కోసం ఓ కథను వినిపించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా అనుష్క కూడా ఓకే చెప్పగా.ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో షూటింగ్ లో పాల్గొననని చెప్పిందట.
ఇక ఈ సినిమా గురించి అనుష్క త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది.