కరోనా ఎంతో మంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
కరోనా మొదటి వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదైనా మరణాలు మాత్రం అంతగా నమోదు కాలేదు.కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.
కరోనా బారిన సామాన్యులే కాదు సెలెబ్రెటీలు కూడా మరణిస్తున్న పరిస్థితి ఉంది.దీంతో ప్రజలందరూ మృత్యువు మన ముంగిట కదులుతున్నదనే చాలా మంది మానసికంగా బాధపడుతున్నారు.
అయితే తాజాగా ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే.
దీంతో వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న టీఎన్ఆర్ మృతి చెందడంతో వారి కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయంగా అందజేశారు.
తాజాగా డైరెక్టర్ మారుతి తన గొప్ప మనసు చాటుకున్నారు. టీఎన్ఆర్ కుటుంబానికి తన వంతు సహాయంగా యాభై వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు.
దీంతో ఇంతటి క్లిష్ట సమయంలో టీఎన్ఆర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకురావడం సంతోషకరం.ఇప్పటికే చాలా మంది కూడా టీఎన్ఆర్ సతీమణికి తమ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఐ డ్రీం ఛైర్మన్ పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.