భారతీయులు ఉపాది కోసం మస్కట్, అబుదాబి, లకు వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయా దేశాలలో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.
ఆదేశ వాసులతో పాటు వలస వాసులు కూడా లాటరీలు కొనుగోలు చేసి తమ అదృష్టాలను పరీక్షించుకుంటారు.ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది భారత వలస వాసులు కోటీశ్వరులు అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
డబ్బున్నోళ్ళకు లాటరీ తగలడం పెద్ద విషయం కాదు.కూలి నాలి చేసుకునే వారిని లాటరీ వరిస్తే…అది కూడా ఊహించని విధంగా కోట్ల రూపాయలు వచ్చి పడితే అబ్బా ఆ సంతోషమే వేరు అచ్చం ఇలాంటి సంఘటనే మస్కట్ లో ఓ భారతీయుడికి ఎదురయ్యింది.
ఉపాది కోసం మస్కట్ కు వలస వెళ్ళిన భారతీయుడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు.వివరాలలోకి వెళ్తే.
కేరళకు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సుమారు 20 ఏళ్ళ క్రితమే మస్కట్ లో ఉద్యోగానికి వెళ్ళారు.అక్కడే ఉంటూ కుటుంభాన్ని పోషించుకుంటున్నాడు.ఎన్ని ఇబ్బందులు ఉన్నా తన అదృష్టాన్ని లాటరీల రూపంలో ఎప్పటికప్పుడు పరీక్షించుకునే శ్యామ్ కొన్ని రోజుల క్రితం లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.అయితేఊహించని విధంగా తాను కొన్న టిక్కెట్టు డ్రాలో గెలుచుకున్నట్టుగా అతడికి మెయిల్ అందింది.
ముందు అది ఫేక్ అనుకున్నా తరువాత సంస్థ యాజమాన్యం శ్యామ్ కు ఫోన్ ద్వారా వివరాలు చెప్పడంతో షాక్ అయిపోయాడు.ఇంతకీ అతడు గెలుచుకున్న మొత్తం అక్షరాలా రూ. 2 కోట్ల రూపాయలు.రాత్రికి రాత్రే తనకు వచ్చిన ఈ అదృష్టాన్ని చాలా సేపటి వరకూ నమ్మలేక పోయానని, ఈ డబ్బుతో కష్టాలు అన్నీ తీరిపోనున్నాయని చెప్పిన శ్యామ్, కేరళ వెళ్ళిపోయి కొత్త ఇల్లు కొనుక్కుంటానని తెలిపాడు.