తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడును రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ ఆహ్వానించారు.ఇటీవల కాలంలో శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఓ యువకుడు సోనూ సూద్ చిత్రాన్ని తయారు చేసిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ సోను సూద్ చేస్తున్న సేవలను అభినందిస్తూ ఎంపీ కొనియాడారు.
అయితే తాజాగా దీనికి స్పందించిన సోనుసూద్ ఆ యువకుడిని తీసుకొని మీరు కూడా లంచ్ చేయడానికి రావాలని ఆహ్వానిస్తూ సోనుసూద్ సోషల్ మీడియా ద్వారా ఎంపి కి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం భారతదేశం ఉన్న ఉత్పత్తి పరిస్థితులలో తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు రియల్ హీరో సోనుసూద్.
భారతదేశ ప్రభుత్వం చేయలేని పనులను కూడా సోనుసూద్ తన టీం సభ్యులతో కలిసి చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.ఆయన ఏ కింద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దేశంలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేయాలని నడుంబిగించారు.
నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేయాల్సిన ఈ పనిని సోనుసూద్ స్వయంగా తన భుజానికి ఎత్తుకొని తన టీంతో కలిసి పని కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో చూస్తున్న కొన్ని విషాదకరమైన సంఘటనలను తనను కలిచి వేశాయని
అలాంటి పరిస్థితులు వల్ల తిరిగి ఉండకుండా ఉండేందుకు ఎందరో కరోనా బాధితులకు అండగా నిలిచిన సోనుసూద్ మరో అడుగు ముందుకు వేసి ఆక్సిజన్ ప్లాంట్లను స్థాపించేందుకు నడుంబిగించారు.ఇప్పటికే దేశంలో 3 లేదా 4 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రెడీ చేసేందుకు ఫ్రాన్సు దేశంలో ఉన్న పనిముట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.కేవలం 10 రోజుల్లో ఫ్రాన్సు నుండి భారతదేశానికి ఆ ప్లాంట్ రాబోతోంది.