పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ఇటీవల ఎన్నికైన సంగతి తెలిసిందే.జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీగా బీజేపీతో తలపడిన దీదీ అదే రీతిలో నిర్ణయాలు తీసుకుంటుంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 30 వేల కోట్లు. బెంగాల్ ప్రభుత్వానికి ఆదుకోవటానికి ఇవ్వాలని మమతా గతంలో లెటర్ రాయడం తెలిసిందే.
ఇదిలా ఉంటే కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలంటే దేశీయ విదేశీయ సంస్థలలో ప్రోత్సహించే పరిస్థితి దేశంలో ఉండాలని మోడీకి మమతా బెనర్జీ తాజాగా లెటర్ రాశారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఇతర సంస్థలకు అవకాశం కల్పిస్తే ప్రోత్సహిస్తే కచ్చితంగా భూములు ఇస్తామని మమతా తెలిపారు.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వ్యాక్సిన్ తయారీ విధానం .నత్తనడకన సాగుతోంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కలిగిన అనేక ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీలు ఉన్నాయని .తయారీదారులు వెంటనే ఉత్పత్తిని వేగవంతం చేయాలని మమతా బెనర్జీ కోరారు.బెంగాల్ రాష్ట్రంలో ఉత్పత్తి అందించడానికి కంపెనీలకు కేంద్రం అవకాశాలు ఇస్తే బెంగాల్ ప్రభుత్వం వ్యాక్సిన్ తయారు చేయడానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మమత తెలిపారు.
.