ఒకటే జననం.ఒకటే మరణం.
ఒకటే గమనం.ఒకటే గమ్యం.
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు.బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు.
ఎంతో ఇన్స్ప్రేషన్ కలిగిస్తూ ఒత్తిడిలో ఉన్న వారిని సైతం ఉత్తేజ పరిచే ఈ పాట శ్రీహరి నటించిన భద్రచలం చిత్రంలోనిది.
సుద్ధాల అశోక్ తేజ రచించిన ఈ సాహిత్యం వింటే కరోనా సమయంలో బ్రతుకుతో పోరాడుతున్న ప్రతి వారి పోరాటానికి బాసటగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కోవిడ్ సోకగానే ఎంతో ధైర్యంగా ఉండే వారు సైతం ఢీలా పడిపోయి భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలా మరణించిన వారి వివరాలు తెలుసుకుంటూ బ్రతికున్న వారు భయంతో చస్తున్నారు.కానీ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కొత్త చరిత్ర సృష్టించింది.110 ఏళ్ల వృద్ధుడు దేశంలో కరోనాను జయించిన వీరుడుగా అధ్యాయనాన్ని సృష్టించాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అతనే హైదరాబాద్లోని కీసరగుట్టలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న 110 ఏళ్ల రామానంద తీర్థ. కాగా, 18 రోజుల చికిత్స అనంతరం రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.
రాజారావు తెలిపారు.కానీ ఇతని ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యేంత వరకు ఆసుపత్రిలోనే ఉంచి పర్యవేక్షించాలని వెల్లడించారు.
చూశారా భయం బ్రతికుండగానే చంపేస్తే, ఆత్మస్దైర్యం మరణాన్ని సైతం జయించేలా మనిషిని నడిపిస్తుంది.