టాలీవుడ్ లో మరో విషాదం.. కరోనాతో సీనియ‌ర్​ సంగీత దర్శకుడు మృతి.. !

ఒకప్పుడు చావాలని అనిపించినా చావడానికి ధైర్యం సరిపోయేది కాదు.కానీ నేడు దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా వల్ల, బ్రతకాలని ఉన్నా అడగకుండానే చావు దరికి చేరుతుంది.

 Tollywood Senior Music Director  Ks Chandrasekahr Died, Tollywood, Senior Music-TeluguStop.com

మరీ నరకం కనిపించేలా ఊపిరి ఆపేస్తుంది.

ఇక ఈ కోవిడ్ దాటికి చిత్రపరిశ్రమ కూడా ఆత్మీయులెందరినో కోల్పోతుంది.

ఇప్పటి వరకు చిత్ర రంగానికి చెందిన ఎందరో మరణించారు.ఇంకా మరణిస్తున్నారు.

ఇకపోతే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.సీనియ‌ర్​ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కరోనాతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.

కాగా చిరంజీవి హీరోగా నటించిన యమకింకరుడు చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన చంద్రశేఖర్ ఆ తర్వాత ఆణిముత్యం, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు.

ఇక ప్రముఖ సంగీత దర్శకులైన ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ కేఎస్ చంద్రశేఖర్ గారి వద్దే దగ్గరే శిష్యరికం చేశారట.కాగా నింగికెగసిన ఈ సంగీత కెరటం ఆత్మకు శాంతి చేకురాలని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube