ఒకప్పుడు చావాలని అనిపించినా చావడానికి ధైర్యం సరిపోయేది కాదు.కానీ నేడు దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా వల్ల, బ్రతకాలని ఉన్నా అడగకుండానే చావు దరికి చేరుతుంది.
మరీ నరకం కనిపించేలా ఊపిరి ఆపేస్తుంది.
ఇక ఈ కోవిడ్ దాటికి చిత్రపరిశ్రమ కూడా ఆత్మీయులెందరినో కోల్పోతుంది.
ఇప్పటి వరకు చిత్ర రంగానికి చెందిన ఎందరో మరణించారు.ఇంకా మరణిస్తున్నారు.
ఇకపోతే టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.సీనియర్ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కరోనాతో బాధపడుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.
కాగా చిరంజీవి హీరోగా నటించిన యమకింకరుడు చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన చంద్రశేఖర్ ఆ తర్వాత ఆణిముత్యం, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, ఉదయం, అదిగో అల్లదిగో లాంటి హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు.
ఇక ప్రముఖ సంగీత దర్శకులైన ఎం.ఎం.కీరవాణి, కోటి, మణిశర్మ కేఎస్ చంద్రశేఖర్ గారి వద్దే దగ్గరే శిష్యరికం చేశారట.కాగా నింగికెగసిన ఈ సంగీత కెరటం ఆత్మకు శాంతి చేకురాలని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.