మంత్రి ఈటెల వ్యవహారం రాజకీయంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.మెదక్ జిల్లా మూసాయిపేట మండలం అచ్చంపేట గ్రామ రైతులు మంత్రి ఈటెల రాజేందర్ తమ భూములు కబ్జా చేశాడని ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే.
వెంటనే రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ అత్యవసర విచారణకు ఆదేశించారు.అనంతరం మంత్రి పదవి నుండి కూడా భర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాడు.అయితే తాజాగా కేసీఆర్ కు ఈటెలకు రాజకీయంగా పెద్ద ఎత్తున వైరం ఏర్పడింది.
అయితే తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే.అయితే ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలలో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు.
అయితే ఈటెల వరుస భేటీల వెనుక ఉన్న కారణం ఏంటని రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్న పరిస్థితి ఉంది.అయితే వరుస భేటీల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటని ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ లాంటి రాజకీయ మేధావిని ఢీ కొనడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు.
అందుకే వివిధ రకాల రాజకీయ పార్టీల నాయకుల నుండి సలహాలు స్వీకరించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈటెల తీసుకునే నిర్ణయం భారీగా ఉండే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది.